
By - Sathwik |9 Feb 2024 9:30 AM IST
వచ్చే ఎన్నికల్లో టీడీపీ 17 లోక్సభ స్థానాలను గెలుచుకోబోతోందంటూ ఇండియా టుడే- సి ఓటర్ సర్వే వెల్లడించడంపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వైసీపీకి అంతిమయాత్ర పక్కా... సైకో పోతున్నాడు, సైకిల్ వస్తోందని ఇండియా టుడే- సి ఓటర్ సర్వే చెప్పిందని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్తో ఇండియా టుడే ఫొటోను ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 45 శాతం ఓటర్లు టీడీపీ-జనసేనతోనే ఉన్నారని... ఈ రెండు పార్టీలు 17 లోక్సభ సీట్లు గెలుచుకుంటాయి. 41 శాతం ఓట్లతో వైసీపీ 8 స్థానాలకు పరిమితం కానుందని ఆజ్తక్ ఛానల్ సర్వేలో పేర్కొన్న విషయాలను లోకేశ్ ప్రస్తావించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com