
By - Sathwik |1 Jan 2024 8:30 AM IST
గుంటూరు జిల్లా మంగళగిరి చేనేతలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అండగా నిలిచారు. మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతాన్నికి చెందిన సుమారు వందమంది మహిళలకు తన సొంత నిధులతో తయారు చేయించిన రాట్నాలను పంపిణీ చేశారు. పార్టీ నేతలు వాటిని లబ్ధిదారులకు అందజేశారు. అధికారంలో లేకపోయినా నారా లోకేష్ మంగళగిరి ప్రజలకు 20కి పైగా సంక్షేమ పథకాలను తన సొంత నిధులతో అమలు చేస్తున్నారని..... అదే ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే మంగళగిరిని ఇంకెంత అభివృద్ధి చేస్తారో ఒకసారి ప్రజలు ఆలోచించాలని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికలలో నారా లోకేష్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com