
తెలుగుదేశం అధినేత చంద్రబాబును అంతం చేసేందుకే అక్రమ అరెస్టు చేయించారని... ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అనుమానం వ్యక్తం చేశారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్దే బాధ్యతని లోకేశ్ అన్నారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు. ఆధారాల్లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకు జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. చంద్రబాబుకు జైలులో భద్రత లేదని విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవట్లేదని ఆక్షేపించారు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడన్నారు. చంద్రబాబుకు ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారన్న లోకేశ్... చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ దే బాధ్యతన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com