
By - Chitralekha |19 Aug 2023 3:35 PM IST
నారా లోకేష్ పాదయాత్ర కృష్ణా తీరంలోకి ప్రవేశించబోతోంది. కాసేపట్లో చంద్రబాబు నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. ఉండవల్లి కరకట్టపై నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి ప్రవేశించనుంది. లోకేష్కు స్వాగతం పలికేందుకు కేశినేని చిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రకాశం బ్యారేజీ మీదుగా లోకేష్ పాదయాత్ర సాగినప్పుడు బోట్స్ ద్వారా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. సుమారు 150 పడవలు యువగళం జెండాలు కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com