By - Vijayanand |21 Aug 2023 7:06 AM GMT
టీడీపీ నాయకులు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. యువగళం 189వ రోజు పాదయాత్ర నిన్న విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి నిడమనూరు వరకు సాగింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర ఇవాళ తెల్లవారుజాము వరకు సాగింది. సుమారు 12 గంటలు నిర్విరామంగా 16 కిలోమీటర్ల వరకు పాదయాత్ర సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అర్ధరాత్రి దాటాక కూడా పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు వేచి ఉండటంతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ లోకేష్ ముందుకు సాగారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com