Nara Lokesh: కొనసాగుతున్న నారాలోకేష్ పాదయాత్ర

Nara Lokesh:  కొనసాగుతున్న  నారాలోకేష్ పాదయాత్ర

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పాదయాత్ర యువగళం పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం నుంచి పాదయాత్రగా బయలుదేరిన లోకేష్ కు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. తెదేపా-జనసేన నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి లోకేష్ వెంట నడుస్తున్నారు. తెలుగుదేశం నాయకులు చినరాజప్ప, వర్మ, నవీన్, లోకేష్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. సామర్లకోట మండలం పవర మీదుగా పిఠాపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. పిఠాపురం ఉప్పాడ సెంటర్ లో ఈ సాయంత్రం బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతారు. అనంతరం కొండెవరం, కొత్త ఇసుకపల్లి మీదుగా యండపల్లి వరకు యాత్ర కొనసాగనుంది.

Next Story