By - Chitralekha |28 Aug 2023 6:11 AM GMT
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 197వ రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం సుందరరావు పేట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. లింగపాలెంలో స్థానికులతో సమావేశమైన అనంతరం పాదయాత్ర చేపట్టారు. ఇప్పటి వరకు లోకేష్ 2 వేల 624 కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతం చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. ఫాతిమాపురం జంక్షన్ లో రైతులతో సమావేశమవుతారు. చింతలపూడి శివార్లతో భోజన విరామనం అనంతరం.. తిరిగి పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి తీగల వంచ శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com