
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్కు ఘన స్వాగతం లభిస్తోంది. లోకేష్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తల తోపాటు ప్రజలు, అభిమానులు అడుగులో అడుగు వేస్తున్నారు. దారి పొడువునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా నారా లోకేష్.. వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ 183వ రోజు సిరిపురం శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సిరిపురంలో స్థానికులతో సమావేశమయ్యారు యువనేత. కాసేపట్లో వరగానిలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముచ్చటించనున్నారు యువనేత.
సాయంత్రం 4గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుంది.రావెల శివార్లలో అమరావతి ఆవేదన కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం స్థానికులతో మాటామంతీ నిర్వహిస్తారు.జై టీడీపీ, జై లోకేష్ నినాదాలతో దద్దరిల్లింది తాడికొండ.లోకేష్ను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు ప్రజలు. ఆయన కోసం దారిపొడవునా బారులు తీరి ఎదురు చూస్తున్నారు జనం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com