
75వ గణతంత్ర వేడుకల సందర్భంగా.... దేశ ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు... తెలిపారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ ... బలమైన.... మరింత సంపన్నమైన భారత్ ను నిర్మించేందుకు కలిసి పని చేద్దామని..... పిలుపునిచ్చారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో విరాజిల్లే దేశం భారత్ అని ఉపరాష్ట్రపతి అన్నారు. రాజ్యాంగ సూత్రాలను మరోసారి మననం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..... జాతీయ నాయకుల స్ఫూర్తితో ముందుకుసాగాలని.... సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు, వీర సైనికులందరినీ........... కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్మరించుకున్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ప్రజాస్వామ్య విలువలను రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేద్దామంటూ అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ..ఈ చారిత్రాత్మక రోజు సందర్భంగా భారత్ ను మరింత బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com