
By - Vijayanand |22 Aug 2023 3:46 PM IST
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రకృతి వనరుల దోపిడీ నిర్విరామంగా సాగుతోంది. అధికార పార్టీ అండతో ఇప్పటికే అడ్డూ అదుపు లేకుండా మట్టి, ఇసుక దోపిడీ సాగిస్తున్నారు. తాజాగా చెట్లపై కూడా అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది వరుసగా చెట్ల నరికివేత కొనసాగుతోంది. అవనిగడ్డ గుర్రపు చెరువు, బందలాయి చెరువుల్లో భారీ వృక్షాలు ఇటీవల నరికి అమ్మేశారు. అవనిగడ్డలోని తంగిరాల వీర రాఘవయ్య గ్రామ పంచాయతీ పార్కులో భారీ వృక్షాలు అక్రమ నరికివేతకు గురయ్యాయి. అవనిగడ్డలో వాల్టా చట్టం పూర్తిగా ఉల్లంఘనకు గురవుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com