By - Sathwik |3 Jun 2024 6:45 AM IST
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిదే అధికారమని... ఇండియా టుడే- మై యాక్సిస్ కూడా తేల్చిచెప్పింది. దాదాపు అన్ని కీలక సర్వేలు కూటమికే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఇండియా టుడే- మై యాక్సిస్ కూడా చేరింది. తెలుగుదేశం సొంతంగా 78 నుంచి 96 స్థానాల్లో విజయం సాధిస్తుందని... మిత్రపక్షాలు జనసేన 16 నుంచి 18 స్థానాల్లో, భాజపా 4 నంచి 6 స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేసింది. మొత్తంగా NDAకు 98 నుంచి 120 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్ ఎగ్జిట్పోల్స్ ప్రకటించింది. ఇక అధికార వైకాపాకు 55 నుంచి 77 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పింది. కాంగ్రెస్కు 0 నుంచి 2 సీట్లు వస్తాయని తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com