బాలున్ని రక్షించిన NDRF టీం

బాలున్ని రక్షించిన NDRF టీం

బ్రిడ్జి మధ్యలో ఇరుక్కున్న బాలున్ని కాపాడారు NDRF సిబ్బంది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం బీహార్ లో జరిగింది. నస్రిగంజ్ లో నివసించే 11సంవత్సరాల బాలుడు పిల్లర్ మధ్యలో ఇరుక్కున్నాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ టీం బాలున్ని రక్షించడానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 20 గంటల పాటు శ్రమించినా లాభం లేకపోయే సరికి, పిల్లర్ స్లాబ్, రోడ్డును కూడా కొద్దిగా తొలంగించి బాలున్ని రక్షించారు. బాలుడికి మతిస్థిమితం సరిగ్గా లేదని అధికారులు తెలిపారు. రెండురోజుల క్రితం బాలుడు ఇంటినుంచి వెళ్లిపోయాడని చెప్పారు. అతడిగురించి తల్లిదండ్రులు వెతుకుతున్నట్లు చెప్పారు.

Next Story