By - Chitralekha |26 May 2023 6:11 AM GMT
నెల్లూరు జిల్లా కావలిలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నగరంలో టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు. వైసీపీ ప్లెక్సీలు తప్ప కావలిలో ఎవరి ప్లెక్సీలు ఉండొద్దంటూ అధికారులకు వైసీపీ పెద్దలు హుకుం జారీ చేశారు. ఈమేరకు టీడీపీ అభిమానులు లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. అధికారుల తీరుపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com