ప్రమాదకర వంతెన పై ప్రయాణాలు సాగిస్తున్న ప్రజలు

ప్రమాదకర వంతెన పై ప్రయాణాలు సాగిస్తున్న ప్రజలు

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాలెం గ్రామ ప్రజలు ప్రమాదకర వంతెనపై ప్రయాణాలు సాగిస్తున్నారు. చనిపోయిన వారి అంత్యక్రియలు చేయాలన్నా కేబుల్ బ్రిడ్జి పై ప్రయాణం చేయాల్సిందే. తాళ్లు తెగిపోవడంతో ప్రాణాలను పణంగా పెట్టి రాకపోకలు సాగిస్తున్నారు. 2003లో బకింగ్ హమ్ కాలువపై 20 లక్షల వ్యయంతో టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. 2021లో వచ్చిన వరదలతో కేబుల్‌ బ్రిడ్జి కొట్టుకుపోవడంతో తాళ్లు తెగిపోయాయి.అప్పటి నుంచి తిరిగి కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదన్న గ్రామస్తులు మండిపడుతున్నారు.

Next Story