
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో అక్కడి పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు. ఆయనతో పాటు కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలను ఏకం చేయడంలో క్రికెట్ను మించినది లేదంటూ క్రిస్టోఫర్ లక్సన్ ట్వీట్ చేశారు. తాను క్రికెట్ ఆడిన ఫొటోలను పంచుకున్నారు.
కాగా, తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను న్యూజిలాండ్ ప్రధాని కలిశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ , క్రిస్టఫర్ లక్సన్ సోమవారం దిల్లీలో విస్తృత స్థాయి చర్చలు కూడా జరిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com