
నామినేటెడ్ పదవులపై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పర్యాయాలు ఒక పదవిలో కొనసాగిన తర్వాత ఉన్నత పదవికైనా వెళ్లాలి.. లేదా ఓ విడత ఖాళీగా అయినా ఉండాలని లోకేశ్ వ్యాఖ్యానించారు. పార్టీ నిర్ణయం తీసుకుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, తాను కూడా పదవి తీసుకోకుండా సామాన్య కార్యకర్తలుగా పనిచేయాలని అన్నారు. అందరి ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకుంటామని నారా లోకేశ్ వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పనిచేసేవారు పొలిట్బ్యూరో వరకు వచ్చే అవకాశం ఉంటుందని అప్పుడే పార్టీ బలపడుతుందని లోకేశ్ అన్నారు. నెల రోజుల్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్న నారా లోకేశ్... ఎలాంటి షరతులూ లేకుండా ఎన్డీయేలో టీడీపీ కొనసాగుతోందని స్పష్టం చేశారు. మూడు పార్టీల కలయికతో రాష్ట్ర ప్రయోజనాలు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను లోకేశ్ ప్రారంభించారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు నివాసంలో టీడీపీ నేతలు.. కార్యకర్తలతో లోకేశ్ సమావేశమై కీలక అంశాలపై చర్చలు జరిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com