ఇళ్ల పట్టాలు ఇచ్చారు సరే... స్థలమెక్కడ?

ఇళ్ల పట్టాలు ఇచ్చారు సరే... స్థలమెక్కడ?

ఎన్టీఆర్‌ జిల్లా గుంటుపల్లిలోఇళ్ల పట్టాల డొల్లతనంపై కలెక్టర్‌ను వైసీపీ నేతలే నిలదీశారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ స్థలం ఎక్కడ ఉందో తెలియదంటున్నారు లబ్ధిదారులు. వారితో కలసి గుంటుపల్లిలో కలెక్టర్‌ను అడ్డకున్నారు అధికార పార్టీ నేతలు. ఉత్తుత్తి పట్టాలు మాకు వద్దంటూ జగనన్న ఇళ్ల పట్టాలను కలెక్టర్‌ కాళ్ల దగ్గర పడేసిన లబ్ధిదారులు. అసలైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు. లబ్ధిదారులతో కలిసి వైసీపీ నేతలే కలెక్టర్‌ను ఘెరావ్‌ చేయడంతో ఈ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది.

Next Story