
By - Chitralekha |1 Aug 2023 2:47 PM IST
ఆదిలాబాద్ జిల్లా సిరిచెల్మా అప్పు చెల్లించలేదని శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేయించింది గ్రామ పంచాయతీ. గ్రామానికి చెందిన శ్రీనివాస్, రాజేందర్ వద్ద 24వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించక పోవడంతో సర్పంచ్ భర్త సమక్షంలో పంచాయితీ పెట్టించారు. అప్పు చెల్లించనుందకు శ్రీనివాస్ ఇంటికి తాళం వేయాలని పంచాయతీ పెద్దలు తీర్మానం చేశారు. దీంతో శ్రీనివాస్ కుటుంబం రాత్రంతా ఆరుబయటే నిద్రించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం ఇంటికి తాళం తీయించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com