
By - Chitralekha |18 Aug 2023 12:46 PM IST
బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం అనేక పోరాటాలు, సాహసాలు చేసిన వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాపన్న గౌడ్ 373 వ జయంతి సందర్భంగా యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అనేక కోటలను స్వాధీనం చేసుకున్నాడని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని కిషన్ రెడ్డి కొనియాడారు. అనంతరం ఖమ్మం పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com