
By - Chitralekha |9 Aug 2023 11:56 AM IST
జగన్ దురాగతాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్నారు టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా పాలిస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేపట్టిన పెన్నా టు వంశధార యాత్రకు ప్రజాదరణ లభిస్తోందన్నారు. అది చూసి ఓర్వలేక తప్పుడు కేసులు పెట్టారన్నారు. రాయలసీమ పర్యటనకు విశేష ఆదరణ వచ్చిందన్నారు. చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారన్నారు పల్లా శ్రీనివాస్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com