రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు; బాధితుడి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు; బాధితుడి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రయాణికుడి ప్రాణాలు కాపాడారు 108 సిబ్బంది. అనంతపురం జిల్లాలోని వెంకటాంపల్లి - ఖాదర్‌పేట సమీపంలో ఓ వ్యక్తి రైల్లో నుంచి జారి పడ్డాడు. తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఇది గమనించిన రైల్వే లైన్‌మెన్లు స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. ప్రయాణికుడు పడిపోయిన ప్రాంతానికి వాహనం వెళ్లడానికి వీల్లేకపోవడంతో.. స్ట్రెచర్‌ మీద పడుకోబెట్టి 3 కిలోమీటర్ల మేర సిబ్బంది నడుచుకుంటూ తీసుకెళ్లారు. అనంతరం 108లో గుంతకల్‌ ఆస్పత్రికి తరలించారు.

Next Story