
By - Sathwik |26 Sept 2023 6:00 AM IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మలివిడత వారాహి యాత్ర ఖరారైంది. అక్టోబర్ 1 నుంచి పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర చేపడతారని ఆపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ విడత.. వారాహి యాత్ర సాగనుండటంతో స్థానిక నేతలతో నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డలో వారాహి యాత్ర సభ జరుగుతుందని..మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజక వర్గాల మీదుగా యాత్ర సాగుతుందని నాదెండ్ల తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com