By - Vijayanand |3 Aug 2023 1:50 PM GMT
ఏపీలో ఎన్నికల కమిషన్ స్వతంత్రగా పనిచేయలేని దుస్థితి ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేకుండా చేశారని మండిపడ్డారు. సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దన్న విన్నపానికి ఈసీ సానుకూలంగా స్పందించిందని తెలిపారు. వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ దారి మళ్లిస్తున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అధికారులు ఎవరైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని.. ఎన్నికల కమిషన్ చెప్పిందని పయ్యావుల తెలిపారు
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com