
By - Vijayanand |5 Aug 2023 4:06 PM IST
పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను విడుదల చేయాలని PDSU తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్ యూనివర్సిటీలను కార్పోరేట్ విద్యాసంస్ధలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉదయం అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్ధి సంఘాల నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రికత్తకు దారి తీసింది. విద్యార్ధి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com