Online Fraud : ఆన్ లైన్ మోసం.. యూట్యూబ్ వీడియోల‌ను లైక్ చేస్తే ...

Online Fraud : ఆన్ లైన్ మోసం..  యూట్యూబ్ వీడియోల‌ను లైక్ చేస్తే ...

యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం ద్వారా బాగా డబ్బులు సంపాదించవచ్చు అని మభ్యపెట్టి, పలువురి నుంచి రూ.73 లక్షలు కాజేసిన ముఠా సభ్యుల్లో ఒకరైన 28 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబ్, మోజ్ యూప్ ల పేరుతో ఈ గ్యాంగ్ ఆన్ లైన్ మోసానికి పాల్పడింది. నిందితుడు హరియాణాకు చెందిన సోనేపట్ వాసి అజయ్ కుమార్ ను గురుగ్రాంలో అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుమార్ అనే వ్యక్తి గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్ ద్వారా లింక్ పంపాడు. యూట్యూబ్ కంటెంట్ ను లైక్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆర్జించవచ్చని నమ్మించాడు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలని మభ్యపెట్టాడు. ఈ విషయంలో మోసం వంటివి ఏవి ఉండవని నమ్మబలికాడు. దీంతో కుమార్ పలుమార్లు ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఈ విధంగా మరికొందరినీ మోసం చేసి పెద్ద మొత్తంలో బురిడీ కొట్టించాడు. ఈ కేసులో ఇతర నిందితుల బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బు చేరవేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమార్ నుంచి రికవరీ చేసిన మొబైల్, రెండు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story