By - Sathwik |25 March 2024 3:00 AM GMT
పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలుగుదేశం ఇన్ ఛార్జ్ వర్మ పునరుద్ఘాటించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీమంత్రి సుజయ కృష్ణ రంగారావుతో కలిసి పవన్ తో సమావేశమయ్యారు. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నందున చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఇద్దరు నేతలు జనసేనానికి వివరించారు. త్వరలో ప్రచారం ప్రారంభిస్తున్నట్లు పవన్ స్పష్టం చేశారు. శ్రీ దత్త పీఠాన్ని దర్శించుకున్న అనంతరం వర్మ ఇంటికి వెళ్లి.. తెలుగుదేశం నాయకులను కలుస్తానని పవన్ చెప్పారు. మూడు పార్టీలు సమన్వయంతో పని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com