
By - Bhoopathi |15 July 2023 8:15 AM IST
ఒక విమానం రన్వే నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఫెన్సింగ్ను అది ఢీకొట్టి ముక్కలైంది. దాని రెక్కలు విరిగిపోయాయి. టైర్లు ఊడిపోయాయి. అయితే అదృష్టవశాత్తు విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. సోమాలియా రాజధాని మొగదీషులో ఈ మిరాకిల్ జరిగింది. ప్రమాద సమయంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి మొత్తం 34 మంది ఉండగా.. ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సొమాలి సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. అయితే విమానం రన్ వే నుంచి పక్కకు ఎందుకు వెళ్లిందో అన్నదానికి సరైన కారణం తెలియలేని వెల్లడించింది. దర్యాప్తు తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com