
By - Vijayanand |26 Aug 2023 11:59 AM IST
ప్రపంచానికే భారత్ దిక్సూచిగా మారుతోందన్నారు ప్రధాని మోదీ. ఇస్రో శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ నేరుగా బెంగళూరు వచ్చారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో హెడ్ క్వార్టర్స్కు ప్రధాని వెళ్లారు. ఇస్రో సెంటర్లో ఉద్వేగానికి గురైన మోదీ చంద్రయాన్-3లో పాల్గొన్న శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో ఛైర్మన్, మిషన్ డైరెక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు. చంద్రయాన్-3 ప్రయోగం ఎలా సాగిందో ఇస్రో ఛైర్మన్ ప్రధానికి వివరించారు. ఆదిత్య మిషన్, గగన్యాన్పై ప్రధాని ఆరా తీశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com