MODI: రాష్ట్ర విభజనపై మోడీ సంచలన వ్యాఖ్యలు

MODI: రాష్ట్ర విభజనపై మోడీ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాజ్ పేయీ హయాంలో ఛత్తీస్ గఢ్ , ఉత్తరాఖండ్ , ఝార్ఖండ్ రాష్ర్టాల ఏర్పాటును పార్లమెంట్ అందరి ఆమోదంతో జరిపిందని నూతన రాష్ర్టాలతో పాటు విభజన రాష్ర్టాలు సైతం సంతోషంగా సంబరాలు జరుపుకున్నాయని మోడీ గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటు సమయంలో మాత్రం తెలుగు రాష్ర్టాలు సంబరాలు చేసుకోలేకపోయాయని లోక్ సభలో గుర్తు చేశారు.


ఏకాభిప్రాయంతో ఎంతటి కఠిన సమస్యలైనా పార్లమెంట్ ద్వారా పరిష్కరమయ్యాయని అన్నారు. 2000 సంవత్సరంలో అటల్ సర్కారు అందర్నీ సంతృప్తి పరిచేలా మూడు రాష్ట్రాల్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు సరిగా జరగలేదన్న మోడీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో రెండు తెలుగు రాష్ట్రాలు అసంతృప్తికి గురయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ హక్కులను అణచివేయడానికి భారీ ప్రయత్నాలు జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మూడు రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఉన్న ఉత్సాహంతో జరిపి ఉంటేఈరోజు సరికొత్త ఎత్తులకు వెళ్లి ఉండేదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

Next Story