By - Vijayanand |16 July 2023 10:40 AM GMT
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడి జెడ్పీ హైస్కూల్లో పీఈటీ వెంకటేశ్వర్రావు పై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. విద్యార్ధినులను ఆటలాడించే సమయంలో.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్ధినులు ఫిర్యాదు చేయడంతో స్కూల్ ముందు ఆందోళనకు దిగారు విద్యార్ధి సంఘాల నేతలు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు... విద్యార్ధినుల అభియోగాలు నిర్ధారణ కావడంతో.. పీఈటీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. స్కూల్ ఇంఛార్జ్ హెచ్ఎం ఫిర్యాదుతో.. పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com