"రాహుల్‌ ను విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదు"

రాహుల్‌ ను విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదు

రాహుల్‌గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదని.. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. అసలు కేటీఆర్‌కు వ్యవసాయం గురించి తెలుసా అని ప్రశ్నించారు. భారత్‌ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను..రాహుల్‌గాంధీ స్వయంగా తెలుసుకున్నారని చెప్పారు. అసలు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. రేవంత్‌రెడ్డి మాటల్ని వక్రీకరించి పబ్బం గడుపుకోవాలని కేటీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ నాయకులు చూస్తున్నారని పొంగులేటి విమర్శించారు. పార్టీలో అందర్నీ కలుపుకొని ముందుకెళ్తానన్నారు.

Next Story