
By - Vijayanand |29 Aug 2023 1:27 PM IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించటం ఖాయమని మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయేనని, రాహుల్గాంధీని ప్రధానిని చేసేందుకు కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఖమ్మం జిల్లా మధిర మండలంలో పొంగులేటి పర్యటించారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒకటేనని, కేంద్రంలోని బీజేపీ నేతల కనుసన్నల్లో బీఆర్ఎస్ నడుస్తోందని విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com