
By - Vijayanand |18 Aug 2023 2:09 PM IST
ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది.గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను నిలదీశారు మహిళలు. దర్శి నగర పంచాయతీ పరిధిలోని కొత్త రెడ్డి పాలెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను నాలుగేళ్లలో ఏంచేశారని నిలదీశారు స్థానికులు.రోడ్లు, డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించకుండా..తమ ఊరికి ఎందుకొచ్చారంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఊదరగొట్టిన ఇంటింటికి రేషన్ బియ్యం కూడా తమకు అందడం లేదంటూ కొత్తరెడ్డి పాలెం గ్రామస్తులు నిరసన తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com