By - Vijayanand |10 Aug 2023 6:31 AM GMT
తనపై అక్రమ కేసులు పెట్టారంటూ... ప్రసాద్ అనేక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జరిగింది. దీంతో కుటుంబసభ్యులు సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వైసీపీ నేతల ప్రోద్భలంతో.. పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటున్నారు. అందువల్లే దీనికి కారకులైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అయితే.. పోలీసులు మాత్రం.. పశువును దొంగలించాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com