
By - Bhoopathi |11 July 2023 7:30 AM IST
ప్రకాశం జిల్లా దర్శిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.సాగర్ కాలువలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఘటనలో 8 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఒంగోలు డిపోకు చెందిన ఇంద్ర బస్సును పెళ్లి బృంది అద్దెకు తీసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com