Chandrayan 3: దేశవ్యాప్తంగా సర్వమత ప్రార్ధనలు

Chandrayan 3: దేశవ్యాప్తంగా సర్వమత ప్రార్ధనలు

చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ కావాలని దేశమంతా సర్వమత ప్రార్ధనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సాధువులు యాగం చేపట్టారు. చంద్రయాన్‌ మిషన్‌ విజయవంతం కావాలని హోమం నిర్వహించారు. అటు వారణాసిలోనూ చంద్రయాన్‌-3 సక్సెస్‌ కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ యాగంలో సాధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒడిషా సముద్ర తీరంలో ప్రముఖ సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ విక్రం ల్యాండర్‌ చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్‌ కావాలని ఇసుకతో సైకత శిల్పం ఏర్పాటు చేశారు. చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ కావాలని కోరుకుందాం.

Next Story