By - Vijayanand |20 Aug 2023 8:49 AM GMT
భద్రాద్రి కొత్తగూడెం మాతాశిశు కేంద్రంలో గర్భిణి మృతితో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టేకులపల్లి మండలం మొక్కంపాడు తండాకు చెందిన గర్భిణి..14 రోజుల క్రితం డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరింది. అర్ధరాత్రి బ్లీడింగ్ అధికమవడంతో చనిపోయిందని సిబ్బంది చెప్పారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ బిడ్డ పరిస్థితి బాగాలేదని ఎన్ని సార్లు చెప్పినా డాక్టర్లు పట్టించుకోలేదని మృతదేహాన్ని కూడా చూపించకుండా మార్చురీకి తరలించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com