టీడీపీలోకి జగన్ సొంత జిల్లా నేతలు

టీడీపీలోకి జగన్ సొంత జిల్లా నేతలు

సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరనున్నారు ముస్లిం, ఆర్యవైశ్య నేతలు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరనున్నారు. అలాగే వైసీపీ మాజీ మున్సిపల్ ఛైర్మన్ పాణ్యం సావిత్రమ్మ కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇక వైశ్య సామాజిక వర్గ నేత రవీంద్ర,అతని అనుచరులు కూడ టీడీపీ లో చేరనుండటంతో ప్రొద్దుటూరు నియోజక వర్గ టీడీపీ జోష్‌ నెలకొంది.టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో 150 కార్లలో అమరావతి బయలుదేరారు ముస్లిం నేతలు, కార్యకర్తలు.

Next Story