PV Sindhu: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం

PV Sindhu: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం

భారీ అంచనాలు, ఆశలు, పతకం తప్పక గెలుస్తుందన్న నమ్మకాలను నిలబెడుతూ బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు తొలి మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించింది. మాల్దీవుల ప్లేయర్‌ ఫాతిమాల్‌ను వరుస సెట్లలో ఓడించి.. సింధు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. తొలి సెట్‌ను 21-9 సునాయసంగా గెలిచిన తెలుగు తేజం.. రెండో సెట్‌లో చెలరేగిపోయింది. 21-6తో ఏకపక్షంగా గెలిచింది. కేవలం 29 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగిసింది. సింధు ధాటికి మాల్దీవుల ప్లేయర్‌ అసలు నిలబడలేకపోయింది. రెండో సెట్‌లో అయితే స్మాష్‌లు, క్రాస్‌ షాట్లతో సింధు చెలరేగిపోయింది. మైదానంలో చిరుతలా కదులుతున్న సింధు ఆట ముందు మాల్దీవుల ప్లేయర్‌ తేలిపోయింది. కేవలం 29 నిమిషాల్లో వరుసగా రెండు సెట్లలో గెలిచి సింధు తదుపరి రౌండ్‌కు చేరింది

Next Story