
By - Sathwik |11 Jun 2024 6:30 AM IST
జగన్ ప్రభుత్వంలో తనను కస్టడీలో హింసించడంపై ఉండి ఎమ్మెల్యే రఘు రామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీస్ కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి.. CID చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు,నాటి ముఖ్యమంత్రి జగన్ , సీఐడీ అదనపు ఎస్పీవిజయ్ పాల్ పై రఘరామరాజు ఫిర్యాదు చేశారు. తన గాయాలపై గుంటూరు GGH సూపరింటెండెంట్...... తప్పుడు నివేదిక ఇచ్చారన్నారు. జగన్ ను విమర్శిస్తే చంపేస్తామని సునీల్ కుమార్ బెదిరించారని తన ఫిర్యాదులో ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com