దేశంలో ఏం జరుగుతుందో ప్రధానికి తెలియడం లేదు- రాహుల్

దేశంలో ఏం జరుగుతుందో ప్రధానికి తెలియడం లేదు- రాహుల్

దేశంలో ఏం జరుగుతుందో ప్రధాని మోదీకి తెలియడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైరయ్యారు. మణిపూర్‌లో హింస జరుగుతుంటే ప్రధాని మోదీ నవ్వుతూ గడపడం దుర్మార్గమన్నారు. ఇక మణిపూర్ అంశంపై ప్రధాని స్పీచ్‌ చాలా అమాయకంగా ఉందన్నారు. సైన్యానికి సమయం ఇస్తే రెండు రోజుల్లో మణిపూర్‌ పరిస్థితిని చక్కదిద్దుతారని... అయితే కేంద్రం ఆ పని చేయడం లేదన్నారు. అందుకే భారతమాతను చంపేశారని చెప్పా అన్నారు. ఇక మణిపూర్‌ ఘటనలకు కేంద్రానిదే బాధ్యత అన్నారు.

Next Story