By - Vijayanand |7 Aug 2023 6:37 AM GMT
పార్లమెంట్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ. వాయిదా తరువాత మధ్యాహ్నం 12 గంటలకు సభకు హాజరు కానున్నారు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసింది లోక్సభ కార్యాలయం. లోక్సభ సభ్యత్వం పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.గతంలో పరువునష్టం కేసులో సురత్ కోర్టు రాహుల్కు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే సుప్రీంకోర్టులో మాత్రం రాహుల్కు భారీ ఊరట లభించింది. దీంతో ఆయన తిరిగి లోక్సభలో అడుగుపెట్టే అవకాశం లభించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com