
By - Vijayanand |15 July 2023 6:15 PM IST
పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మోదీ ఇంటి పేరు కేసులో తన శిక్షను నిలిపివేయాలన్న రాహుల్గాంధీ అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. నేరారోపణలపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు తీర్పును సమర్థించింది. రాహుల్గాంధీ సుప్రీంకోర్టును తలుపుతట్టారు. పరువునష్టం కేసులో తన శిక్షను సస్పెండ్ చేయాలని అభ్యర్థించారు. రాహుల్ పిటిషన్ ఈ నెల 17న విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com