By - Chitralekha |18 Aug 2023 7:08 AM GMT
కర్నూలు మార్గదర్శి లో రెండో రోజు దాడులు కొనసాగుతున్నాయి. కోర్టు ఆదేశాలు ధిక్కరించి నిన్న ఆర్ధరాత్రి ఒంటి గంట వరకు సోదాలు చేశారు. ఇవాళ ఉదయం మూకుమ్మడిగా సోదాలు ప్రారంభించారు. నిన్న అర్ధరాత్రి మార్గదర్శి కార్యాలయం బయట నోటీసులు అంటించి ఫోటోలు తీసుకుని వెంటనే చించేశారు. ఇదే విషయాన్ని అధికారుల దగ్గర మార్గదర్శి మేనేజర్ ప్రస్తావించగా చిట్స్ రిజిస్ట్రార్ మల్లికార్జున దాటవేశారు. ఈ సోదాల్లో సీఐడీ సీఐ డేగల ప్రభాకర్, చిట్స్ రిజిస్ట్రార్ మల్లికార్జున, డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com