నెలకు 200 వ్యాగన్లు తయారు: కిషన్ రెడ్డి

నెలకు 200 వ్యాగన్లు తయారు: కిషన్ రెడ్డి

రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి, రైల్వే వ్యాగన్ల పరిశ్రమకు పెద్దగా తేడా లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నెలకు 200 వ్యాగన్లు తయారు చేసే సామార్థ్యంతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వ్యాగన్ల తయారీతో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. జూలై 8న మోడీ రైల్వే వ్యాగన్ల పరిశ్రమకు, నేషనల్ హైవేలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. మోడీ రాగానే వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా ఎదగాలన్నదే మోడీ ఆకాంక్ష అని అన్నారు కేంద్ర సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందన్నారు కిషన్ రెడ్డి.

Next Story