AP Rain Alert :బంగాళాఖాతంలో అల్పపీడనం

AP Rain Alert :బంగాళాఖాతంలో అల్పపీడనం
X
నేడు వాయుగుండంగా మారే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని, శని, ఆదివారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. నేడు మన్యం, అల్లూరి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్ష సూచన ఉందని తెలిపారు. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్‌, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం తెలిపారు.

ఈ అల్పపీడనం వల్ల జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ ‌చేశారు. కాగా, నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి. అవి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో మరి కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించనున్నాయి. వచ్చే నెల 8 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఎండాకాలం ముగియకముందే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతుంటే, మరికొన్ని ప్రాంతాల వారు వానల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు కూడా ఈ సారి త్వరగా వస్తున్నాయి.

Tags

Next Story