
By - Vijayanand |26 Jun 2023 11:24 AM IST
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడం గ్రామంలోవంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు వంగవీటి రాధా. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీతో వంగవీటి రాధాకు స్వాగతం పలికారు రెడ్డిగూడెం గ్రామయువకులు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన వంగవీటి రాధా భావోద్వేగానికి గురయ్యారు. రంగా ప్రజల పక్షాల నిలిచిన నాయకుడన్నారు. మరణించిన 34 ఏళ్లైనా ఇప్పటికీ జనం గుండెల్లోనే ఉన్నారన్నారు. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని.. ఎందరిని ప్రభావితం చేశామన్నదే ముఖ్యమన్నారు. ఎన్నిసార్లు గెలిచామా, ఓడామా అని కాకుండా... ప్రజల పక్షాన నిలబడ్డామా లేదా అన్నదే ముఖ్యమన్నారు రాధా. ఇంత అభిమానం చూపిస్తున్న ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com