
By - Vijayanand |2 July 2023 4:21 PM IST
సత్యసాయి జిల్లా మడకశిరలో స్థానికులకు రేషన్ కార్డు కష్టాలు తప్పడం లేదు.రేషన్ కార్డులో తమ పిల్లల పేర్లు ఎక్కించేందుకుఅధికారులు చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా కనికరించడం లేదని ఓ వైసీపీ కార్యకర్త అధికారులను నిలదీశాడు.మూడేళ్లగా పట్టించుకోవడం లేదంటూ జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తనని,గ్రామంలో మొదటి వైసీపీ జెండా వ్యక్తిని కూడా తానే నన్నాడు..తన పిల్లలకు కూడా జగన్, షర్మిల పేర్లు పెట్టానని అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకం అందలేదని.. చివరకు తాను స్వంతంగా కట్టుకున్న ఇళ్లకు కూడా బిల్లులు మంజూరు చేయలేదని అన్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com