భూపాలపల్లిలో 200 మందిని తరలించాం- మంత్రి సత్యవతి రాథోడ్‌

భూపాలపల్లిలో 200 మందిని తరలించాం- మంత్రి సత్యవతి రాథోడ్‌

భూపాలపల్లి జిల్లాలోని మొరంచపల్లి గ్రామంలో వరదలో చిక్కుకున్న రెండువందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. రెస్యూ చేసిన వారందరినీ కరకపల్లి విలేజ్‌లోని పునరవాస కేంద్రాలకు తరలించామన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం వాతావరణం అనుకూలించలేదని.. దీంతో హెలికాప్టర్ ద్వారా రక్షణ చర్యలు చేపట్టలేకపోయామన్నారు.

Next Story