
By - Vijayanand |6 July 2023 6:26 PM IST
ధరణి ముసుగులో భారీ అవినీతి జరిగిందని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. భూముల్లో భయంకరమైన దోపిడీ జరుగుతోందన్న ఆయన.. ఏ భూమిని ఎవరి పేరు మీదైనా రిజిస్ట్రేషన్ చేయొచ్చన్నారు. ప్రభుత్వ భూములు, మన భూములు, ఆధార్, పాన్కార్డ్ వివరాలు.. విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయాయని అన్నారు. తెలంగాణ ప్రజల ఆస్తిపాస్తుల వివరాలు విదేశీయుల చేతుల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత ప్రమాదకరం.. అత్యంత తీవ్రమైన నేరం అని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిపై విచారణ చేయిస్తామని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com